ఆంధ్రప్రదేశ్లో ఆసక్తికర ఘటన జరిగింది. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్కు.. మరో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వినతి పత్రం సమర్పించారు. ఏపీ ప్రభుత్వం ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి భూముల మార్కెట్ విలువను పెంచాలని ఆలోచిస్తున్న నేపథ్యంలో రాయచోటి రెవెన్యూ కార్యాలయం పరిధిలో పెంపు వద్దంటూ మంత్రి అనగానికి.. మండిపల్లి వినతి పత్రం అందించారు. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచితే సామాన్యులు ఇబ్బందులు పడతారని.. రియల్ ఎస్టేట్ కుదేలవుతుందని వివరించారు.