Andhra Pradesh Record Temperature: ఏపీలో ఎండల తీవ్రత మరింత పెరుగుతుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని.. కడప జిల్లా ఒంటిమిట్టలో మంగళవారం 45 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైందన్నారు. మంగళవారం రోజు262 మండలాల్లో 40డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ నెల 18 వరకు వేడి గాలులు వీస్తాయంటున్నారు. రాష్ట్రంలో ప్రజలు ఎండలు, ఉక్కపోత, వేడిగాలుల దెబ్బకు ఇబ్బందిపడుతున్నారు.