Andhra Pradesh Degree Colleges Bandh: ఆంధ్రప్రదేశ్లో ప్రైవేటు డిగ్రీ కాలేజీల యాజమాన్య సంఘం ఈ నెల 21న కాలేజీలు బంద్ చేయాలని నిర్ణయించింది. డ్యూయల్ మేజర్ డిగ్రీ అమలు చేయాలనే డిమాండ్తో పాటు సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. సమస్యలు పరిష్కరించకపోతే నిరసన తెలుపుతామని హెచ్చరించారు. డిగ్రీ ప్రవేశాలు ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 17న ఉన్నత విద్యామండలి కార్యాలయం వద్ద ధర్నాకు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి.