Andhra Pradesh Women Natural Farming Rs 2 Lakh: అన్నమయ్య జిల్లా మహిళలు రసాయన ఎరువులకు దూరంగా ప్రకృతి వ్యవసాయంతో ఆదర్శంగా నిలుస్తున్నారు. పొదుపు సంఘాలతో కలిసి చిరుధాన్యాల తినుబండారాలు తయారు చేసి విక్రయిస్తూ లక్షలు సంపాదిస్తున్నారు. కూరగాయలు, ఆకుకూరలు పండిస్తూ, రాగి లడ్డూలు, కొర్ర పాయసం వంటి వాటిని మండల కేంద్రాల్లో అమ్ముతున్నారు. వారానికి రూ.14 వేల నుంచి రూ.20 వేల వరకు ఆదాయం పొందుతూ, కుటుంబానికి లక్ష నుంచి రెండు లక్షల వరకు సంపాదిస్తున్నారు.