APSRTC 1500 New Buses: ఏపీలో ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కొత్తగా 1500 బస్సులు కొనాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. త్వరలో 1050 విద్యుత్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలో స్త్రీ శక్తి పథకం విజయవంతంగా అమలవుతోంది, దీని ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణం లభిస్తోంది. ఆర్టీసీ బస్టాండ్లను మినీ విమానాశ్రయాలుగా ఆధునీకరించనున్నట్లు ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు.