ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలుపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. భీమవరంలో పర్యటించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్.. ఉచిత బస్సు పథకం ఎప్పటి నుంచి అమలుచేస్తామనే దానిపై అప్ డేట్ ఇచ్చారు. ప్రస్తుతం ఏపీలోని పలు జిల్లాలలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉందన్న మంత్రి గొట్టిపాటి రవికుమార్.. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే మెగా డీఎస్సీ, ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేస్తామన్నారు. మరోవైపు ఈ పథకం ఉగాది నుంచి అమలు చేస్తారని ఆర్టీసీ వర్గాలు చెప్తున్నాయి.