Andhra Pradesh Mgnrega Workers Wages Release:: ఉపాధి హామీ కూలీలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. గత ప్రభుత్వం నిలిపివేసిన బిల్లులను ప్రస్తుత కూటమి ప్రభుత్వం విడుదల చేసింది. వారం రోజుల్లో కూలీల ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి. గోకులాల నిర్మాణానికి సంబంధించిన బిల్లులు కూడా చెల్లించనున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.1,280 కోట్లు విడుదల చేశాయి. మెటీరియల్ కాంపోనెంట్ నిధులతో చేసిన పనులకు రూ.980 కోట్ల పెండింగ్ బిల్లులను ప్రభుత్వం చెల్లిస్తుంది.