AP Govt Mgnrega Additional 50 Work Days: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒక్కో కుటుంబానికి ఇప్పటికే లభిస్తున్న వంద పనిదినాలతో పాటు అదనంగా మరో 50 రోజులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కరువు మండలాలకు సంబంధించిన జిల్లా కలెక్టర్లకు ఉత్తర్వులు పంపారు. కరువు మండలాల్లో ప్రతి కుటుంబానికి 150 రోజుల పనిదినాలు అమలు చేయాలన్నారు. శ్రీసత్యసాయి, అన్నమయ్య, కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాలకు చెందిన 54 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించిన సంగతి తెలిసిందే.