AP Govt Teachers Transfers: ఉపాధ్యాయుల బదిలీలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు జరుపుతోంది. టీచర్ల బదిలీల కోసం ఏపీ ప్రభుత్వం ఇప్పటికే కొత్త చట్టాన్ని తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ చట్టం ప్రకారం మే నెలలో ఉపాధ్యాయుల బదిలీలను చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికీ ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాలను విడుదల చేసి అభ్యంతరాలను స్వీకరించారు. తుది జాబితాలను త్వరలోనే విడుదల చేయనున్నారు. అనంతరం మే నెలలో ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ చేపట్టి.. నెలాఖరుకు పూర్తి చేయాలని ఏపీ విద్యాశాఖ భావిస్తోంది.