ఏపీలో ఎల్పీజీ గ్యాస్ సరఫరాపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీలో గ్యాస్ కొరత లేదని చంద్రబాబు ప్రజలకు సూచించారు. రాష్ట్రంలో 14 వేల మెట్రిక్ టన్నుల గ్యాస్ నిల్వలు ఉన్నాయని.. మరికొన్ని మెట్రిక్ టన్నులు త్వరలోనే వస్తున్నాయని వెల్లడించారు. 15 రోజులకు అవసరమైన గ్యా్స్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని.. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మరోవైపు ఇండక్షన్ స్టవ్స్ స్టాక్స్ పెంచాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు.