Andhra Pradesh New Gst Record: ఆంధ్రప్రదేశ్ జీఎస్టీ వసూళ్లలో రికార్డు సృష్టించింది. గత ఆగస్టుతో పోలిస్తే ఈ ఆగస్టులో 21% వృద్ధి నమోదు చేసింది. దేశ సగటు వృద్ధి 10% ఉండగా, ఏపీ రెట్టింపు వృద్ధి సాధించింది. జీఎస్టీ అమలులోకి వచ్చాక ఇదే అత్యధిక రాబడి అని అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షలతో జీఎస్టీ వసూళ్లు మళ్లీ పెరిగాయని వాణిజ్య పన్నుల శాఖ తెలిపింది. ఇది ప్రభుత్వానికి ఊరటనిచ్చే అంశం.