AP Govt 90% Subsidy For Drip Irrigation: ఏపీ ప్రభుత్వం ఎఫ్ఆర్ఏ పట్టాదారులకు భారీగా రాయితీలు ప్రకటించింది. 100శాతం రాయితీపై సూక్ష్మ సేద్యం అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. అలాగే తుంపర సేద్యానికి అవసరమైన పరికరాలను 90శాతం రాయితీపై అందిస్తోంది. రాష్ట్రంలో ఎనిమిది జిల్లాల్లో 2.26 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుందని అధికారులు చెబుతున్నారు. ఎఫ్ఆర్ఏ పట్టాలు ఉండి ఈ పథకానికి అర్హులైనవారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.