Andhra Pradesh Settibalija Merged In Ocs: ఏపీలో ఆ కులాన్ని ఓసీల్లోకి మారుస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ అంశంపై ఏపీ మంత్రి స్పందించారు. రాష్ట్రంలో శెట్టిబలిజలను ఓసీల్లో చేరుస్తున్నారంటూ వైఎస్సార్సీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆరోపించారు. ఇది కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నమని, పెట్టుబడులను అడ్డుకునే కుట్ర అని ఆయన అన్నారు. రాష్ట్రంలో యూరియా కొరత లేదని, వైఎస్సార్సీపీ రైతులను భయపెడుతోందని విమర్శించారు. రాజకీయ లబ్ధి కోసం తప్పుడు ప్రచారాలు చేస్తోందని ఆయన మండిపడ్డారు.