Andhra Pradesh Woman Corona Positive: ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్లో తొలి కేసు విశాఖపట్నంలో నమోదైంది. 28 ఏళ్ల మహిళకు పాజిటివ్గా నిర్ధారణ అయింది, ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు మాస్క్లు ధరించాలని, లక్షణాలు ఉంటే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రజలు గుంపులుగా ఉండొద్దని, ప్రార్థనా సమావేశాలు, సామాజిక సమావేశాలు, పార్టీలు, వంటి సామూహిక సమావేశాల విషయంలో జాగ్రత్తగా ఉండాలంటున్నారు.