Andhra Pradesh Govt Contract Employees Regularization: ఏపీ ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక ప్రకటన చేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సంబంధించి ఆయన స్పందించారు. ప్రస్తుతం 4,333 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని.. వీటి క్రమబద్ధీకరణపై అడ్వకేట్ జనరల్ అభిప్రాయం కోరామన్నారు. మిగిలిన ఉద్యోగుల సర్వీసుల క్రమబద్ధీకరణ అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న 3,324 మంది కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించాము అన్నారు.