Andhra Pradesh Govt Released Fees Reimbursement: ఏపీ ప్రభుత్వం మొత్తానికి కాలేజీలకు ఫీజు రీయింబర్స్మెంట్ నిధులకు లైన్ క్లియర్ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ప్రక్రియ ప్రారంభించింది. తాజాగా రూ.300 కోట్లు విడుదల చేయగా.. ఉగాదికి మరో రూ.900 కోట్లు విడుదల చేయనున్నారు. కాలేజీ యాజమాన్యాలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేడయంతో లైన్ క్లియర్ చేశారు. వాస్తవానికి గత నెలలోనే ఫీజుల విడుదలకు ఉత్తర్వులు వచ్చిన సంగతి తెలిసిందే.