AP Students Fee Reimbursement Application 2025 Process Started: ఆంధ్రప్రదేశ్లోని విద్యార్థులకు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ గురించి ముఖ్యమైన సూచనలు చేసింది. అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, కాపు, ఈబీసీ విద్యార్థులు జ్ఞానభూమి వెబ్సైట్లో ఈ నెలాఖరు వరకు వివరాలు నమోదు చేసుకోవాలని అధికారులు తెలిపారు. గత సంవత్సరం ప్రవేశాలు పొందిన విద్యార్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. ప్రభుత్వం త్వరలో బకాయిలు విడుదల చేయనుంది. కొత్తగా చేరిన విద్యార్థుల పత్రాలను సచివాలయ సిబ్బంది పరిశీలిస్తారు.