Andhra Pradesh Private Degree Colleges Bandh: ఆంధ్రప్రదేశ్లోని ప్రైవేట్ డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు బోధన రుసుములు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశాయి. లేని పక్షంలో ఈ నెల 22 నుంచి కళాశాలలు మూసివేస్తామని హెచ్చరించాయి. రుసుములు విడుదల చేయకపోవడంతో సమస్యలు వస్తున్నాయని, ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోతున్నామని యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేశాయి. ప్రభుత్వం స్పందించకపోతే అక్టోబరు మొదటి వారంలో నిరవధిక సమ్మె చేస్తామని హెచ్చరించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.