Andhra Pradesh Kutami Govt One Year: టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఆంధ్రప్రదేశ్లో అధికారం చేపట్టి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేరుస్తూ, అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలకు పెద్దపీట వేసింది. ముఖ్యంగా అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్టు పనులను తిరిగి ప్రారంభించడంతో పాటు పలు భారీ పెట్టుబడులను ఆకర్షించింది. కేంద్రం సహకారంతో రానున్న నాలుగేళ్లలో అభివృద్ధి, సంక్షేమాన్ని కొనసాగించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.