KK Survey On Ys Jagan: ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా, కేకే పారా వీల్ అనే వెబ్సైట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేకే మాట్లాడుతూ, తమ సర్వేలో 19 మంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని తేలిందని చెప్పారు. అంతేకాకుండా, జగన్ అసెంబ్లీకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని, సచివాలయం వ్యవస్థ ఉండాలని కూడా అభిప్రాయపడుతున్నారని తెలిపారు. ప్రజల నాడి తెలుసుకోవడానికి ఈ వెబ్సైట్ ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు.