దశాబ్ద కాలం నాటి ఎదురుచూపులకు తెరపడింది. గుంటూరు వాసుల ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెడుతూ.. నందివెలుగు ఆర్వోబీ నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. గుంటూరులో నందివెలుగు రైల్ ఓవర్ బ్రిడ్జి పనులకు పదేళ్ల కిందట ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 2018లో పనులు ప్రారంభమయ్యాయి. సగం పనులు పూర్తైన తర్వాత ఆర్థిక సమస్యలతో ప్రాజెక్టు ఆగిపోయింది. అయితే గుంటూరు ఎంపీ, కేంద్ర మంత్రి పెమ్మసాని చొరవతో ప్రాజెక్టు పనులు తిరిగి ప్రారంభమవుతున్నాయి. టెండర్లు కూడా ఖరారు చేశారు.