ఏపీలో కొత్త థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. రూ.30000 కోట్ల అంచనా వ్యయంతో 3200 మెగావాట్ల సామర్థ్యం కలిగిన థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు కోసం ఏపీ జెన్కో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. శ్రీకాకుళం జిల్లా వెన్నెలవలస గ్రామంలో దీనిని ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రచించారు. ఈ పవర్ ప్లాంట్ ఏర్పాటు కోసం సుమారుగా రెండు వేల ఎకరాల భూమి అవసరమని ఏపీ జెన్కో అంచనా వేసింది.