సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో పలు కీలక ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. అమరావతి పరిధిలోని అనాథలు, భూమిలేని పేదలకు పింఛన్లు మంజూరు చేయాలనే ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అనాథ పిల్లలకు పింఛన్ల మంజూరుపై ఇప్పటికే సీఆర్డీఏ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అలాగే భూమి లేని పేదలకు పింఛన్ల మంజూరు కోసం సీఆర్డీఏ ఇప్పటికే దరఖాస్తులు కూడా ఆహ్వానించింది. ఈ నేపథ్యంలోనే ఏపీ కేబినెట్ ఈ ప్రతిపాదనలకు తాజాగా ఆమోదం తెలిపింది.