కేంద్రం సహకారంతో ఏపీలో అనేక కీలకమైన పనుల్లో వేగం పుంజుకుంది. గుంటూరులో శంకర్ విలాస్ రైల్వే ఓవర్ బ్రిడ్జి కోసం కొన్నేళ్లుగా స్థానికులు ఎదురుచూస్తున్నారు. కేంద్రం కూడా ఇటీవల ఈ ఆర్వోబీ నిర్మాణ పనులకు రూ.98 కోట్లకు ఆమోదం తెలిపింది. తాజాగా నిర్మా్ణ పనుల కోసం ఆక్రమణలను తొలగిస్తున్నారు. శంకర్ విలాస్ రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణంలో భాగంగా హిందూ కాలేజీ నుంచి ఏసీ కాలేజీ వరకూ రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్నారు. దీంతో ఈ ప్రాజెక్టులో వేగం పెరిగింది.