రామాయపట్నం పోర్ట్ నుంచి తెట్టు రైల్వే స్టేషన్ వరకు 5.5 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే లైన్ను పీఎం గతిశక్తి పథకం కింద నిర్మిస్తున్నట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. ఇది పోర్ట్ అనుసంధానతను మెరుగుపరుస్తుందన్నారు. మరోవైపు, విశాఖపట్నం ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ, సెయిల్లో విలీనం చేసే ఆలోచన లేదని కేంద్ర ఉక్కు శాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ రాజ్యసభలో స్పష్టం చేశారు. కేవలం కొన్ని నిర్వహణ పనుల కోసమే బయట ఏజెన్సీల సాయం తీసుకుంటున్నామని, ఇది ప్రైవేటీకరణ కాదని ఆయన వివరించారు.