ఏపీలో కొత్త సోలార్ పార్కు ఏర్పాటు కానుంది, శ్రీసత్యసాయి జిల్లా పరిగి మండలంలో సోలార్ పవర్ పార్కు ఏర్పాటు చేయడానికి ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రూ.1200 కోట్లతో 200 మెగావాట్ల సోలార్ పార్కు ఏర్పాటు చేయడానికి అనుమతి ఇచ్చింది. యశస్య పవర్ ఎల్ఎల్పీ ఈ సోలార్ పవర్ పార్కు ఏర్పాటు చేయనుంది. పరిగి మండలం బీచుగానిపల్లితో పాటుగా ఆ సమీప గ్రామాలలో ఈ సోలార్ పార్కు ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నారు.