Andhra Pradesh Waqf Board International School: ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరులో ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు కానుంది. 15 కోట్ల రూపాయలతో నెల్లూరులో మొదటి ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు ఛైర్మన్ షేక్ అబ్ధుల్ అజీజ్ వెల్లడించారు. కార్పొరేట్ సోషల్ రెస్సాన్సిబులిటీ కింద సమీకరించిన నిధులతో జామియా మసీదుకు చెందిన భూమిలో ఇంటర్నేషనల్ స్కూలు నిర్మించనున్నట్లు వక్ఫ్ బోర్డు ఛైర్మన్ వెల్లడించారు. ఇందుకోసం మంత్రి నారాయణ వద్ద ప్రతిపాదనలు చేసినట్లు తెలిపారు.