Andhra Pradesh New Airports Update: ఆంధ్రప్రదేశ్లో సాగరమాల ప్రాజెక్టు పనులు, కొత్త విమానాశ్రయాల అభివృద్ధిపై జులై 4న సమావేశం జరగనుంది. 14 విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగా కర్నూలు విమానాశ్రయ అభివృద్ధికి రూ.8.033 కోట్లు మంజూరయ్యాయి. నాగార్జునసాగర్, ఒంగోలు విమానాశ్రయాల అభివృద్ధికి నివేదికలు సిద్ధం చేయనున్నారు. పోర్టులు, ఫిషింగ్ హార్బర్లను 20 వరకు అభివృద్ధి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది అన్నారు మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి.