ఆంధ్రప్రదేశ్లో జాతీయ రహదారుల నిర్మాణం వేగం పుంజుకుంది. కేంద్రం సహకారంతో పలు ప్రాజెక్టుల నిర్మాణంలో పురోగతి కనిపిస్తోంది. ఈ క్రమంలోనే నారాయణపేట చంద్రశేఖరపురం ఆరు వరుసల జాతీయ రహదారి పనులు కూడా జోరందుకున్నాయి. మేఘా ఇంజనీరింగ్ సంస్థ ఈ పనులను చేపడుతోంది. 24.5 కిలోమీటర్ల మేరకు ఈ రహదారి నిర్మాణం జరుగుతోంది. ఇప్పటి వరకూ 14 కిలోమీటర్ల మేర సబ్ గ్రేడ్ పనులు పూర్తయ్యాయి. మిగతా పనులను కూడా సమాంతరంగా చేపడుతున్నారు.