ఏపీలో కొత్త ఎయిర్పోర్టుల నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. వీటితో పాటుగా ఇప్పటికే మొదలైన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు కూడా జోరందుకున్నాయి. ఈ క్రమంలోనే భోగాపురం విమానాశ్రయం కోసం అదనంగా 500 ఎకరాల కేటాయించాలనే దానిపై మంత్రుల కమిటీ మంగళవారం సమావేశమైంది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అధ్యక్షతన సచివాలయంలో మంత్రుల కమిటీ సమావేశమై అదనపు భూకేటాయింపులపై చర్చించింది.