Kurnool Atmakur National Highway 340C: కర్నూలు జిల్లాలో నన్నూరు నుండి ఆత్మకూరు వరకు రూ.1179 కోట్లతో నిర్మిస్తున్న 340సి జాతీయ రహదారి పనులు చివరి దశలో ఉన్నాయి. అయితే పనుల్లో నాణ్యత లోపించిందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాణ్యమైన మట్టి వాడకపోవడం, రోలింగ్ సరిగా చేయకపోవడంతో వర్షాలకు మట్టి కొట్టుకుపోయి గుంతలు ఏర్పడ్డాయని అంటున్నారు. రాళ్లు తేలడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని భయపడుతున్నారు. పనులు త్వరగా పూర్తి చేసి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరుతున్నారు.