నంద్యాల జిల్లా వాసులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. కుందూ నదిపై వంతెన నిర్మాణానికి ఆమోదం తెలిపారు. కుందూ నదిపై నిర్మించిన వంతెన శిథిలావస్థకు చేరుకుంది. దీని స్థానంలో కొత్త వంతెన నిర్మిస్తున్నారు. అయితే నిధుల సమస్యతో పనులు సగానికి పైగా పూర్తైన తర్వాత నిలిచిపోయాయి. ఇదే విషయాన్ని జిల్లా కలెక్టర్ చంద్రబాబుకు కలెక్టర్ల సమావేశంలో వివరించారు. ఈ నేపథ్యంలో కొత్త వంతెన పూర్తి చేసేందుకు చంద్రబాబు ఆమోదం తెలిపారు.