Google investments in Andhra Pradesh: ఏపీలో పెట్టుబడుల ఆకర్షణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ముందుకు వస్తున్నాయి. విశాఖపట్నంలో డేటా సెంటర్ ఏర్పాటు కోసం గూగుల్ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తర్లువాడలో 200 ఎకరాల్లో ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ను గూగుల్ ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం అవసరమైన భూమిని నవంబర్ నెలలో గూగుల్ సంస్థకు అప్పగించేందుకు ఆంధ్రప్రదశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.