శ్రీ సత్యసాయి జిల్లా పరిగి మండలం ధనాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మహిళా భక్తులు మృతి చెందగా.. ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరు కోటికి చౌడేశ్వరి ఆలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. మృతులు రొద్దం మండలం దొడగట్టకు చెందినవారు. సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, బాధితులకు సహాయం అందించాలని ఆదేశించారు.