టీచర్ల బదిలీల ప్రక్రియలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్జీటీ బదిలీలలో మ్యాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని నిర్ణయించింది. వెబ్ కౌన్సిలింగ్ వద్దంటూ రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులు నిరసన బాట పట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఎస్జీటీల బదిలీ ప్రక్రియలో వెబ్ కౌన్సిలింగ్ బదులుగా మ్యాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా విద్యా శాఖ మంత్రి నారా లోకేోష్ ట్వీట్ చేశారు.