Andhra Pradesh Dwcra Women Bamboo Farming: డ్వాక్రా మహిళల ఆదాయం పెంచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా మహిళలు వెదురు సాగు చేస్తారు. రాష్ట్రంలో ఈ ఏడాది 10 వేల మంది మహిళలను వెదురు సాగు వైపు ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఉపాధి హామీ పథకం కింద మొక్కలు ఉచితంగా ఇస్తారు. అంతేకాదు, సాగుకు అయ్యే ఖర్చులను కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది. మొదటి దశలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో వెదురు ప్రాసెసింగ్ ప్లాంటును ఏర్పాటు చేయనున్నారు.