Talliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలుకు సిద్ధమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పథకాల అమలుకు ఒక క్యాలెండర్ను రూపొందించాలని ఆదేశించారు. తల్లులకు ఆర్థిక సహాయం అందించే 'తల్లికి వందనం' పథకాన్ని జూన్లో ప్రారంభించనున్నారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించనున్నారు. మంత్రులు ప్రజల్లోకి వెళ్లి పథకాల గురించి వివరించాలని చంద్రబాబు సూచించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై ఎవరూ మాట్లాడవద్దని ఆదేశించారు.