ఏపీలో తొలి క్వాంటం కంప్యూటర్ ఏర్పాటు కానుంది. అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్లో ఐబీఎం క్వాంటం కంప్యూటర్ ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చదరపు అడుగుకు రూ.30 అద్దె చొప్పున ఐబీఎంకు కేటాయిస్తూ ప్రభుత్వ ఐటీ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటు చేయనున్న ప్రభుత్వం.. ప్రభుత్వ సంస్థగా దీనిని ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే.