దివ్యాంగుల పింఛన్ల వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఏపీలో దివ్యాంగుల పింఛన్ల లబ్దిదారుల్లో అనర్హులు కూడా ఉన్నారని ప్రభుత్వం భావిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గతంలో నకిలీ సదరం సర్టిఫికేట్లు ఇచ్చిన డాక్టర్లపై చర్యలు తీసుకోవాలంటూ నవ్యాంధ్ర వికలాంగుల సేవాసమితి సీఎంవోలో ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో సీఎం ముఖ్య కార్యదర్శి రవిచంద్ర దీనిపై విచారణ చేయాలని వైద్యారోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. దీంతో అలాంటి డాక్టర్లపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం.