ఏపీ రాజధాని అమరావతిలో దేశంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం రూపుదిద్దుకోనుంది. ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. అమరావతిలో 60 ఎకరాల్లో అంతర్జాతీయ స్టేడియం నిర్మిస్తామని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఇటీవల ప్రకటించింది. ఆ మేరకు భూమిని కేటాయించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరుతోంది. తాజాగా అమరావతి అంతర్దాతీయ స్టేడియానికి ఐసీసీ ఛైర్మన్ జైషా కూడా అనుమతి ఇచ్చినట్లు తెలిసింది. ఈ విషయాన్ని ఏసీఏ ఛైర్మన్ కేశినేని చిన్ని వెల్లడించారు. అలాగే ఏపీలో క్రిెకట్ అభివృద్ధికి బీసీసీఐ సహకారం ఉంటుందన్నారు.