ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోంది. అందులో భాగంగా 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు, ఇతర ప్రాంతాల్లో ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటు ద్వారా స్థానికులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పనపై దృష్టి సారించింది. అలాగే తిరుపతి జిల్లాలోని వాకాడు మండలం తూపిలిపాలెం వద్ద కేంద్ర ప్రభుత్వ సహకారంతో రూ.3,500 కోట్లతో నౌకా నిర్మాణ కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం స్థల పరిశీలన జరుగుతోంది. ఇందులో షిప్ బిల్డింగ్, మరమ్మతులు చేపట్టనున్నారు.