రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే మరో కొత్త ఆలోచన చేసినట్లు తెలుస్తోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడం కోసం హెలిపోర్టులు ఏర్పాటు చేసే ఆలోచన చేస్తోంది. అధికారులతో జరిగిన సమీక్షలో చంద్రబాబు ఈ సూచన చేసినట్లు తెలిసింది. ఏజెన్సీ ప్రాంతాల్లో హెలిపోర్టుల ఏర్పాటుపై ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించినట్లు సమాచారం.