ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 8 పర్యాటక ప్రాంతాల్లో కొత్తగా హౌస్ బోట్లు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు ప్రైవేట్ ఆపరేటర్లకు అనుమతులు మంజూరు చేసింది. దాదాపు రూ. 10 కోట్ల పెట్టుబడులతో వివిధ సంస్థలు ఈ హౌస్ బోట్లను ఏర్పాటు చేయనున్నాయి. కాగా, పర్యాటకులకు మెరుగైన సేవలు అందించేందుకు.. ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది.