ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ.. కీలక జిల్లాలకు కొత్త కలెక్టర్లు

2 months ago 19
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలనా యంత్రాంగంలో భారీ మార్పులు చేస్తూ పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. విశాఖపట్నం, గుంటూరు, కాకినాడ, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించింది. విశాఖ కలెక్టర్‌గా అభిషిక్త్ కిశోర్, గుంటూరు కలెక్టర్‌గా సాయికాంత్ వర్మ కీలక బాధ్యతలు చేపట్టనున్నారు. వీటితో పాటు ఏపీఐఐసీ ఎండీగా దినేష్ కుమార్, ఏపీఈడీబీ సీఈఓగా షణ్మోహన్ బదిలీ అయ్యారు. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌గా తమీమ్ అన్సారియాను ప్రభుత్వం నియమిస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.
Read Entire Article