Ntr Bharosa Pension Distribution One Day Before: ఆంధ్రప్రదేశ్ పింఛనుదారులకు శుభవార్త! ఎన్టీఆర్ భరోసా పింఛనును ప్రభుత్వం ఒకరోజు ముందుగానే, మే 31న పంపిణీ చేయనుంది. జూన్ 1 ఆదివారం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇంటికే వెళ్లి పింఛను అందిస్తారు. స్పౌజ్ కేటగిరీ కింద కొత్తగా 89,788 మందికి పింఛన్లు ఇవ్వనున్నారు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాపై నెలకు రూ.35.91 కోట్ల అదనపు భారం పడుతుంది.