AP Govt Suspends Review On Pensions: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగుల పింఛన్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. సదరం ద్వారా అనర్హుల గుర్తింపు ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేసింది. అప్పీలు చేసుకున్నవారికి మళ్లీ పరీక్షలు నిర్వహించనున్నారు. చంద్రబాబు నాయుడు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడుతూ గత ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అర్హులకు న్యాయం చేస్తామని, బోగస్ పింఛన్లు తొలగిస్తామని ఆయన స్పష్టం చేశారు. పింఛన్ల పెంపు గురించి కూడా ఆయన వివరించారు.