Ntr Bharosa Pension Scheme New Scanners: ఏపీ ప్రభుత్వం ఇవాళ పింఛన్ పంపిణీ చేయనుంది. గతంలో పింఛన్ల పంపిణీ, సర్వేలు చేసేటప్పుడు వేలిముద్రలు నమోదు చేయడానికి సిబ్బంది చాలా ఇబ్బందులు పడేవారు. ఎల్జీ స్కానర్లు సరిగా పనిచేసేవి కావు.. దీనివల్ల లబ్ధిదారులు ఇబ్బందిపడేవారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఎల్1 ఆర్డీ పరికరాలను కొనుగోలు చేసి గ్రామ, వార్డు సచివాలయాలకు సరఫరా చేసింది. అవకతవకలకు ఆస్కారం లేకుండా కూటమి ప్రభుత్వం ఎల్-1 ఆర్డీ స్కానర్లు అందుబాటులోకి తెచ్చింది.