NTR Bharosa Pension Scheme Ineligible Persons Remove Update: ఏపీ ప్రభుత్వం పింఛన్లు తీసుకుంటున్న అనర్హుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అనర్హులు ఉంటే.. వారిని తొలగించే అధికారాలు జిల్లా కలెక్టర్లకు అప్పగించారు. ఈ మేరకు అసెంబ్లీలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కీలక ప్రకటన చేశారు. పింఛన్లు తీసుకునేవారిలో అనర్హులు ఉంటే ఫిర్యాదు చేయొచ్చని.. దీనిపై విచారణ చేసిన అనర్హులపై కలెక్టర్లు తొలగిస్తారని మంత్రి శ్రీనివాస్ తెలిపారు.