ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రిటైర్ అయిన ఉద్యోగుల పెన్షన్ దరఖాస్తు విధానంలో కీలక మార్పులు చేసింది. ఇప్పటి వరకూ పెన్షన్ దరఖాస్తులను ఫిజికల్గా సమర్పించే విధానం అమల్లో ఉండగా.. మే ఒకటో తేదీ నుంచి ఇక అంతా ఆన్లైన్లోనే జరగనుంది. పెన్షన్ ప్రపోజల్స్, పెన్షన్ కేసుల ప్రాసెసింగ్ను మే 1 నుంచి నిధి పోర్టల్ ద్వారా మాత్రమే చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.