Andhra Pradesh Digi Lakshmi Scheme: పట్టణ పేదలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం 'డీజీ లక్ష్మి' పేరుతో 10 వేల కియోస్క్ సెంటర్లను ఏర్పాటు చేయనుంది. స్వయం సహాయక సంఘాల సభ్యులు నడిపే ఈ కేంద్రాల్లో 20 రకాల సేవలు అందుబాటులో ఉంటాయి. తక్కువ రుసుముతో అన్ని రకాల సేవలు ఒకేచోట పొందవచ్చు. మొదటి దశలో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరుతో సహా పలు నగరాల్లో ఈ సెంటర్లను ప్రారంభిస్తారు.